ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో ఆదివారం రాత్రి 10 గంటల నుంచి.. సోమవారం ఉదయం 10 గంటల మధ్య నమోదయిన కోవిడ్-19 పరీక్షల్లో.. మరో 14 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో కరోనా మరణాలు మూడుకు చేరాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కి పెరిగింది. పూర్తి కథనం
⍟ ప్రస్తుతం నిర్వహిస్తోన్న కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలను ఇకపై ప్రతి మూడు రోజులకు రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తోంది. కరోనా నిర్ధారణలో కచ్చితమైన ఫలితాలు వచ్చే ఆర్టీ-పీసీఆర్ విధానంలో ప్రభుత్వ ల్యాబొరేటరీల్లో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించనున్నారు. అనుమానాస్పద కేసుల నిర్ధారణ కోసం ఇటీవల అందుబాటులోకి వచ్చిన యాంటీబాడీ పరీక్షలు, క్షయ సహా అనేక ఇతర పరీక్షలను మరింత విస్తరించాలని నిర్ణయించారు. పూర్తి కథనం.
⍟కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) స్పష్టం చేసింది. గతవారం 200 మందికిపైగా సీఈఓలతో ఆ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లాక్డౌన్ కాలం పూర్తయిన తర్వాత అనేక రంగాల్లో ఉద్యోగుల కుదింపులు ఉంటాయని 52 శాతం మంది సీఈఓలు వెల్లడించారని సీఐఐ పేర్కొంది. ‘కొవిడ్ 19 లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలపై ప్రభావం - సీఈఓల స్నాప్ పోల్’ పేరిట సీఐఐ గతవారం ఈ సర్వే నిర్వహించింది. ఆదివారం ఈ నివేదికను ప్రకటించడంతో ఉత్పాదక రంగాల్లోని ఉద్యోగులు కలవరపాటుకు గురవుతున్నారు.
⍟ కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరి సోకిన ఈ ప్రాణాంతక వైరస్.. తాజాగా జంతువులకు వ్యాపించింది. తొలిసారిగా ఓ పులికి కరోనా వైరస్ సోకింది. కరోనా కరాళనృత్యం చేస్తున్న అమెరికాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్లోని బ్రోంక్స్ జూలో మలయన్ జాతికి చెందిన నాలుగేళ్ల నదియా అనే ఆడ పులికి కరోనా వైరస్ సోకింది. వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు
కరోనా వైరస్ లైవ్ అప్డేట్స్: కరోనాపై పోరులో మనదే విజయం.. మోదీ