సీనీ నేపధ్య గాయని  ఎస్.జానకి జన్మదినం నేడే ..


• జన్మ నామం శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి


• తల్లిదండ్రులు: శ్రీరామమూర్తి, సత్యవతి
• స్వస్థలం: పల్లపట్ల, రేపల్లె, గుంటూరు జిల్లా
• జననం: 23 వ తేది శనివారం, ఏప్రిల్ 1938
• ఇతర పేర్లు అమ్మ , కర్ణాటక కొలిగె
• రంగం నేపథ్యగానం, కర్ణాటక సంగీతము
• వృత్తి గాయని
• క్రియాశీల కాలం 1957–2017
• జీవిత భాగస్వామి వి.రామప్రసాద్
• పిల్లలు : మురళీకృష్ణ
• బంధువులు గరిమెళ్ళ బలకృష్ణప్రసాద్


ఎస్.జానకి గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి ప్రముఖ భారతీయ నేపధ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు ,తమిళం ,మలయాళం , కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం ,కన్నడ బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకతించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొన్ధారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుభ్రమణ్యం తో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొన్దారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొన్దారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు.


జననం మరియు బాల్యం


ఎస్.జానకి (జ.ఏప్రిల్ 23,1938) దక్షిణభారత నేపథ్యగాయని. గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతామంగేష్కర్, పి.సుశీల, జిక్కీ, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి మద్రాసుకు మారింది.


ప్రత్యేకతలు:
• జానకి గొంతు ఓ గంగా ప్రవాహం. వయసుతో నిమిత్తం లేని ఆమె స్వరం ఓ కోయిలగానం. ఆమె పలుకు ఓ ప్రకృతి పులకింపు.
• సాధన సంగీతానికి ఆయువు పట్టయితే ఎస్ .జానకి ఆ సాధనకే ఓ ఉదాహరణ.
• ` కోకిల స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ
• ”భారత కోయిల"గా బిరుదు సాధించినా,ఈమె ప్రయాణంలో ఎన్నో రాష్ట్రీయ, జాతీయఅవార్డులను కైవశం చేసుకొన్నా, ఇసుమంతైనా కూడా విరామమెరుగక నేటికీ సంగీత ప్రపంచంలో ఓ విధ్యార్ధియై వినయం ప్రదర్శిస్తూ సాధననుకొనసాగించడమే ఎస్.జానకి విజయానికి కారణం.
• అందుకే ఆమెజీవితం నేటియువ సంగీత కళాకారులకు ఎంతో ఆదర్శం.



జాతీయ పురస్కారాలు
1977 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట: "Senthoora Poove") 16 Vayathinile, తమిళం
1981 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట: "Ettumanoorambalathil") Oppol, మళయాళం
1984 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట : "వెన్నెల్లో గోదారి అందం" ) సితార, తెలుగు
1992 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట: "Inji Iduppazhagha") Devar Magan, తమిళం
నంది పురస్కారం
రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు 10 సార్లు అందుకుంది.


ఇతర పురస్కారాలు
1986లో కలైమామణి
1997లో ఫిలింఫేర్ దక్షిణ భారత సాహిత్య అవార్డు 2002లో ఎచీవర్ అవార్డు
2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం 2009లో గౌరవ డాక్టరేట్
2011లో కర్నాటక బసవభూషణ్ అవార్డు
2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్ అవార్డు
2013లో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు
వీటితోపాటు తమిళనాడు సినీ అవార్డులు 7, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా, కేరళ రాష్ర్ట ఉత్తమ గాయని గా 11 అవార్డులు సాధించింది.
జానకి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా" అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించాడు.


ఎస్. జానకి గారి గాత్రము నుండి మనకందించిన కొన్ని అద్భుత యుగళ గీతాలు


అడగవే జాబిల్లి అడగవే అందాల - భూలోకంలో యమలోకం - 1966 - రచన: దాశరధి
అలుకమానవే చిలుకల కొలికిరో - శ్రీ కృష్ణ సత్య - 1971 - రచన: పింగళి
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము - ఎం.ఎల్.ఏ - 1957 - రచన: ఆరుద్ర
ఇనాళ్ళు లేని సిగ్గు ఇపుడెందుకే - బంగారు తల్లి - 1971 - రచన: డా. సినారె
ఈ పగలు రేయిగ పండు వెన్నెలగ - సిరిసంపదలు - 1962 - రచన: ఆత్రేయ
ఎందుకూ కవ్వించేదెందుకు - ఆలుమగలు - 1959 - రచన: ఆత్రేయ


ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు - నవగ్రహ పూజా మహిమ - 1964 - రచన: జి. కృష్ణమూర్తి
ఎవ్వరో పిలిచినట్టుటుంది ( ఘంటసాల నవ్వు) - విజయం మనదే - 1970 - రచన: డా. సినారె
ఏమోఏమో ఇది నాకేమో ఏమో ఐనది - అగ్గిపిడుగు - 1964 - రచన: డా. సినారె
ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు - గోపాలుడు భూపాలుడు - 1967 - రచన: ఆరుద్ర
ఓరబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను - ఖైదీ బాబాయ్ - 1974 - రచన: డా. సినారె
కలల అలలపై తేలెను మనసు - గులేబకావళి కథ - 1962 - రచన: డా. సినారె
కళ్ళళ్ళో నీరెందులకు కలకాలం - కానిస్టేబులు కూతురు - 1963 - రచన: ఆత్రేయ


కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో - లక్ష్మీ కటాక్షం - 1970 - రచన: కొసరాజు
కుశలమా నీకు ( సంతోషం) - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ - 1966 - రచన: పింగళి
కొండలన్నీ వెదికేను కోనలన్నీ- వసంతసేన - 1967 - రచన: దాశరధి
గున్నమావి కొమ్మన కులికే చిలకమ్మా- పూలమాల - 1973 - రచన: వడ్డాది
గులాబీలు పూచే వేళ కోరికలే పెంచుకో - భలే అబ్బాయిలు - 1969 - రచన: కొసరాజు
చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు - తాళిబొట్టు - 1970 - రచన: ఆత్రేయ
ధర్మం చెయ్యండి బాబు దానం - వంశోద్ధారకుడు - 1972 - దాశరధి
నడిరేయి ఏ ఝాములో స్వామి - రంగుల రాట్నం - 1967 - రచన: దాశరధి
నీ ఆశా అడియాస చెయిజారే మణిపూస - ఎం.ఎల్.ఏ - 1957 - రచన: ఆరుద్ర